నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన 18 ఏళ్ల టి.పరమేశ్వర జగన్నాథం  నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో PUC సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉన్నట్టుండి ఇవాళ(గురువారం) మధ్యాహ్నం హాస్టల్ లోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

విషయం గమనించిన తోటి విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నూజివీడు సీఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.