స్కూల్​లో గుండెపోటుతో స్టూడెంట్ ​మృతి

స్కూల్​లో గుండెపోటుతో స్టూడెంట్ ​మృతి

ధన్వాడ, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా ధన్వాడ మండలంలోని కొండాపూర్ ​గిరిజన గురుకుల స్కూల్​లో టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. ప్రిన్సిపాల్ రాజారం, పీడీ రామ్మోహన్ గౌడ్ కథనం ప్రకారం..మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ మండలం బుడుమతండాకు చెందిన ఎం.శ్రీకాంత్(15)  కొండాపూర్ గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు. 

శుక్రవారం ఉదయం శ్రీకాంత్​ తోటి స్టూడెంట్స్​తో కలిసి టిఫిన్ ​చేశాడు. తర్వాత ప్లేట్​ను పై అంతస్తులో ఉంటున్న తన గదిలో ఉంచి మెట్లు దిగుతూ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు అక్కడి స్టాఫ్​కు చెప్పగా వెంటనే ధన్వాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 

పరీక్షించిన డాక్టర్లు నారాయణపేట దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో అక్కడికి తీసుకువెళ్లగా గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి హాస్పిటల్​కు వెళ్లి శ్రీకాంత్​కుటుంబసభ్యులను పరామర్శించారు.