న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. అయితే డెహ్రాడూన్ కు చెందిన రిషబ్ కౌశిక్ అనే యువకుడు మాత్రం ఇండియాకు రావడానికి మొండికేశాడు. తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క లేకుంటే ఉక్రెయిన్ ను వీడనన్నాడు. మొత్తానికి కుక్కను తీసుకునే భారత్ కు తిరిగొచ్చాడు. హంగేరి మీదుగా స్వదేశానికి చేరుకున్న రిషబ్.. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఓ వీడియోను రూపొందించాడు. పెంపుడు జంతువులను తమ వెంట తీసుకొచ్చేందుకు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ వీడియోలో ప్రస్తావించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Student refuses to leave Ukraine without his dog, reaches India via Hungary
— ANI Digital (@ani_digital) March 4, 2022
Read @ANI Story | https://t.co/unEeukPxCz#UkraineRussianWar #Ukriane #RussianUkrainianWar #RussiaUkraine pic.twitter.com/eG5dPVwMLt
మరిన్ని వార్తల కోసం: