రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన విద్యార్థులు

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన విద్యార్థులు

కర్ణాటకలోని శివమొగ్గలో పాడైన రోడ్లపై వరి నాట్లు వేసి విన్నూత నిరసన తెలిపారు విద్యార్థులు. అధ్వానమైన రోడ్లను బాగు చేయాలంటూ విద్యార్థి సంఘటన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.  పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్లకార్డులు పట్టుకుని  డిమాండ్ చేశారు.  యడ్యురప్పనాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రోడ్లు బాగుచేయలేదన్నారు. రోడ్లు సరిగా లేనందున రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.