అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల టౌన్, వెలుగు: అప్పుల బాధతో సిరిసిల్ల చేనేత కార్మికుడు ఒకరు మానేరు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల టౌన్ గణేశ్ నగర్​కు చెందిన బూర సత్తయ్య(45) మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ ఖర్చులు,
రెండేండ్ల కింద కూతురు పెండ్లి కోసం అప్పులు చేశారు. మిత్తితో అవిప్పుడు రూ.10లక్షలకు చేరుకున్నాయి. వాటిని ఎట్ల తీర్చాలనే ఆవేదనతో బుధవారం పొద్దున10 గంటలకు పనికి వెళ్తున్నానని చెప్పి సత్తయ్య ఇంట్లోంచి బయటికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొడుకు సతీశ్​కు ఫోన్ చేసి సిరిసిల్ల మానేరు బ్రిడ్జి దగ్గరకు రమ్మని చెప్పారు.  ఆయన వచ్చేలోపే నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానేరు కరకట్ట వద్ద తేలిన మృతదేహాన్ని చూసి సతీశ్ బోరున విలపించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లోకల్ ఎస్సై తిరుపతి తెలిపారు.