రైలు పట్టాలపై సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య
తూప్రాన్, వెలుగు: తల్లిదండ్రులతో గొడవ పడిన ఓ యువకుడు రైలు పట్టాలపై సెల్ఫీ వీడియో తీసుకుంటూ రైలు కింద పడి సూసైడ్చేసుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో శనివారం చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ వివరాల ప్రకారం.. శివంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన వినోద్ ఓ ప్రైవేట్కంపెనీ లో పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా బైకు, ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటున్నాడు. శనివారం మరోసారి తల్లిదండ్రుల తో గొడవపడి సూసైడ్చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తూప్రాన్ మున్సిపాలిటీ బ్రాహ్మణ పల్లి ,తూప్రాన్ విలేజీల మధ్య రైలు పట్టాల పై నిలబడి సూసైడ్చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు.