వృద్ధ దంపతుల ఆత్మహత్య

వృద్ధ దంపతుల ఆత్మహత్య

పెద్దపల్లి, వెలుగు: పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం మడక గ్రామంలో చోటుచేసుకుంది. గుడిపాటి సాయిరెడ్డి(85), సూర్యమ్మ(80) భార్యాభర్తలు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అందరికీ పెండ్లిండ్లు అయ్యాయి. కొడుకు వెంకట్​రెడ్డి ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరు… కొడుకు, కోడలు బంధువుల వివాహానికి వెళ్లగా ఆత్మహత్య చేసుకున్నారు. వారు తిరిగి వచ్చేసరికి ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఏఎస్ఐ నయీం తెలిపారు.