Allu Arjun: నేడు ఒకే వేదికపైకి అల్లు అర్జున్-సుకుమార్..

Allu Arjun: నేడు ఒకే వేదికపైకి అల్లు అర్జున్-సుకుమార్..

విలక్షణ నటుడు రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రధారిగా పీబీఆర్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ (Maruti Nagar Subramanyam). లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం (ఆగస్ట్ 21న) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా బన్నీ - సుక్కు విచ్చేయనున్నారు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరికీ విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. దీంతో ఇప్పటివరకు వచ్చిన విభేదాల రూమర్స్ పై నేడు స్టేజి మీద ఏ విధంగా స్పందిస్తారనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి  నెలకొంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే..డైరెక్టర్ లక్ష్మణ్ కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సినిమాను రూపొందించి సుకుమార్ భార్య తబితకు చూపించాడు. ఆమెకు కంటెంట్ నచ్చి ఈ సినిమాకు సమర్పికురాలుగా వ్యవహరించడానికి ముందుకొచ్చింది.కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 7గంటలకు హోటల్ పార్క్ హయత్ లో జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీమియర్స్ ఆగస్ట్ 22న సాయంత్రం 7:40 కి షురూ కానున్నాయి. ఆలస్యం ఎందుకు బుక్ చేసేయండి.