ఎండలో బండి భద్రం…

ఎండలో బండి భద్రం…

వేసవి కాలం వచ్చేసింది.ఎండలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేడిప్రభావంతో కొన్ని సార్లువాహనాలు దగ్ధమైన ఘటనలు చూస్తనే ఉన్నం. ఇంజిన్ బాగా వేడెక్కడం, పెట్రోల్ లీకవడం వంటికారణాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అందుకే వేసవిలో వాహనదారులు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.

ఏ టైర్లలో ఎంత గాలి ఉండాలో వాహన తయారీ దారుల సూచనలు ఫాలోఅవ్వాలి. అయితే వాళ్ల సూచనల ప్రకారం టైర్లలో గాలి ఉండే పరిమాణం సాధారణ ఉష్ణోగ్రతా పరిస్థితుల్లోనే. అధిక ఉష్ణోగ్రతల్లో కాదు. వేడి తగిలితే గాలి వ్యాకోచిస్తుందనే సంగతి తెలిసిందే. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్లు వేడిగా ఉంటాయి. ముఖ్యం గా50 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరిందంటే వేడి ప్రభావంకచ్చితంగా టైర్లపై ఉంటుంది. వేడి తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించాలంటే టైర్లలో గాలి వంద శాతం ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్లపై ఉండే వేడిప్రభావానికి గాలి వేడెక్కి టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఐదు శాతమైనా గాలి తక్కువ ఉండాలి. సాధారణ గాలికి బదులు నైట్రోజన్ అయితే సురక్షితం. అలాగే నాణ్యమైన టైర్లు మాత్రమే వాడాలి. ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సివస్తే ప్రతి నలభై కిలోమీటర్లకు ఒకసారి ఐదు నిమిషాలు ఆగాల్సిందే.

ఇంజిన్ వేడెక్కడం
ఇతర కాలాలతో పోలిస్తే వేసవిలో పగటిపూట ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. అందువల్ల ఎండలో బైకులపై ప్రయాణించేటప్పుడు అక్కడక్కడా నీడలో ఆగి వెళ్లాలి. కనీసం ఐదు నిమిషాలు ఆగితే ఇంజిన్ కాస్త చల్లబడుతుంది. బైక్ ఆపినప్పుడు పెట్రోల్ ఆఫ్ చేయాలి. లేకపోతే పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి, లీకయ్యే ప్రమాదంఉంది. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు పెట్రోల్ లీకైతేమంటలు అంటుకోవచ్చు. ఇంజిన్ వేడెక్కి ఓవర్ఫ్లో అయితే బైక్ త్వరగా స్టార్ట్​ కాదు. ఇంధనంపూర్తిగా ఆవిరైన తర్వాత వాహనం స్టార్ట్​ అవుతుంది. కార్లకు సంబంధిం చి వాహనంలోని రేడియేటర్, ఏసీల్లో సమస్యలు ఏర్పడతాయి.గ్యాస్ కిట్ ఉపయోగించే వాహనదారులు కిట్ పై వస్ర్తం లేదా గోనె సంచి కప్పడం మంచిది. తరచూ గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవాలి. రెండు రోజులకోసారి రేడియేటర్ కూలెంట్స్ స్థాయిని పరిశీలించాలి. కూలెంట్ ఆయిల్ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. కారు స్టార్ట్​ చేయడానికి కొద్దిసేపటి ముం దే ఏసీ ఆన్చేయాలి.

నీడలోనే
ఎండలు బాగా ఉన్నప్పుడు టూ వీలర్, ఫోర్వీలర్ లను నీడలోనే ఉంచాలి. ఎండలోవాహనాల్ని ఉంచితే వాటి రంగు త్వరగామారిపోతుంది. బాడీపై చిన్న చిన్న పగుళ్లువచ్చే అవకాశం ఉంది. ఇలాం టి పరిస్థితిరాకూడదనుకుం టే వాహనాలను నీడలోనేఉంచాలి. వాటిపై ఫ్యాబ్రిక్ కవర్స్​ కప్పాలి.వాహనాలకు చెందిన కనెక్టిం గ్ వైర్లనుచెక్ చేసుకుం టూ ఉండాలి. చాలా మందిట్యాంకు నిం డుగా పెట్రోల్ పోయిస్తుంటారు.వేసవిలో ఎండ వేడికి కొం త మేర పెట్రోల్ఆవిరైపోతుంది. అందుకే ట్యాంకులో సగానికిమిం చకుం డా పెట్రోల్ పోయించు కోవాలి.ట్రాఫిక్ లో ఎక్కువ సేపు ఆగాల్సి వస్తే ఇంజిన్ఆఫ్ చేయాలి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సివస్తే తప్పనిసరిగా ‘ఎమర్జెన్సీ రోడ్ సైడ్ కిట్’వెం ట ఉంచుకోవాలి.

ఐదు నిమిషాలు ఆగితే వేడి తగ్గుతుంది….
బైక్ లను ఎక్కువ సేపు ఎండలో ఉంచితేరంగు పోతుంది. ఎండ వేడికి వాహనాలటైర్లు పగిలే అవకాశం ఉంటుంది.ఎక్కువ సేపు ఎండలో బైక్ నడపరాదు.40 కిలోమీటర్లకు ఒక్కసారి ఐదునిమిషాలు ఇంజిన్ కు విరామం అవసరం.పెట్రోల్ ట్యాంకులు లీకయ్యే ప్రమాదంఉంది. సాధ్యమైనంత వరకు నీడపట్టు నేవాహనాలను నిలిపేలా చూసుకోవాలి.ప్రయాణ సమయంలో చెట్ల నీడలో ఉంచాలి.-రాము, సీనియర్ మెకానిక్ , రామకృష్ణా పూర్