వార్ రూం కేసు : సైబర్ క్రైం విచారణకు హాజరైన సునీల్ కనుగోలు 

వార్ రూం కేసు : సైబర్ క్రైం విచారణకు హాజరైన సునీల్ కనుగోలు 

వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సైబర్ క్రైం విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 :30గంటలకు ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా సీసీఎస్ కు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఆయన సైబర్ క్రైం విచారణకు హాజరుకాలేనని లేఖ రాసినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. అయితే వాటిని సీసీఎస్ ఏసీపీ ఖండించారు. సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చామని, విచారణకు వస్తామని సమాచారం ఇచ్చారని అన్నారు. తమకు ఎలాంటి లెటర్ అందలేదని చెప్పారు. ఈ క్రమంలో సునీల్ కనుగోలు సస్పెన్స్ కు తెరదించుతూ సీసీఎస్ కు వచ్చారు.

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులు కాంగ్రెస్ వార్ రూంలో సోదాలు నిర్వహించారు. ముగ్గురం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీసీఎస్ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వలేమని ఈ నెల 3న హైకోర్టు తేల్చి చెప్పింది. 9న సైబర్ క్రైం విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది.