
న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పును పున:సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్యతో పాటు మరో 31 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు శుక్రవారం సీజేఐ డీవై చంద్రచూడ్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది.