డా.సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్గా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ ‘అమెరికాలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డాక్టరేట్ చేశా. అక్కడొక కంపెనీ ప్రారంభించా.
మన దేశం కోసం ఏమైనా చేయాలనిపించి 5 గ్రామాలను దత్తత తీసుకున్నా. అక్కడి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్తో సమానంగా అభివృద్ధి చేశా. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నా. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను సినిమా ద్వారా చూపించాలనిపింది. అందుకే ఈ చిత్రాన్ని ప్రారంభించా. కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంటుంది. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇది పొలిటికల్ సినిమా కాదు.. పబ్లిక్ మూవీ’ అని చెప్పారు. సుహాస్ మీరా మాటలు, స్ర్కీన్ప్లే, కార్తీక్ బి.కొండకండ్ల సంగీతం అందిస్తున్నారు.