కన్నీటితో సుష్మాకు భర్త, కూతురు గౌరవ వందనం

కన్నీటితో సుష్మాకు భర్త, కూతురు గౌరవ వందనం

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్య క్రియలు కాసేపట్లో అధికారిక లాంఛనాలతో జరగునున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ లో ఆమె పార్థీవ దేహాన్ని ఉంచారు. పలువురు జాతీయ నాయకులు, ప్రముఖులు ఆమెకు కడసారి వీడ్కోలు తెలుపుతున్నారు. సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ , భర్త  స్వరాజ్ కౌషల్ చివరి సారిగా కన్నీటితో సుష్మాకు గౌరవ వందనం తెలిపారు.