ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్లో 10 లక్షల పైన జనాభా గల నగరాల జాబితాలో 4వ స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖ నిలవడం ఆనందదాయకంగా ఉందన్నారు. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.
మరోవైపు కేంద్రం పరిశుభ్రతను పాటిస్తున్న దేశంలోని ఆయా నగరాల ర్యాంకుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడకు 4వ ర్యాంక్, తిరుపతి ఆరో స్థానంలో నిలవగా, విశాఖ తొమ్మిదో స్థానం,హైదరాబాద్ 23వ స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు 31వ ర్యాంకు లభించింది.