అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టింది

అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టింది

అధిక వడ్డీ ఆశ చూపి కోట్లుకొల్లగొట్టింది ఓ మహిళ. లక్షకు లక్ష రూపాయలు ఇస్తా బాధితులను బురిడీ కొట్టి కోట్లు వేనకేసుకుంది స్వర్ణలత. అటు రియల్ ఎస్టేట్ పేరుతోనూ మోసానికి పాల్పడింది. విషయం తెలిసే సరికి ఉడాయించింది.  హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ సంఘటన జరిగింది. 

వనస్థలిపురంలో  స్వర్ణలత అనే మహిళ అధిక వడ్డీ ఆశ చూపి బాధితుల నుంచి కోట్లు వసూలు చేసింది. లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తామని నమ్మబలికింది. దీంతో వేల మంది ఆమెకు లక్షలు అప్పుగా ఇచ్చారు. దీనికి తోడు స్వర్ణలత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోనూ మోసానికి పాల్పడింది. మొత్తంగా 50 మంది బాధితుల నుంచి స్వర్ణలత  రూ. 14 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించింది. దీంతో లబోదిబో మన్న బాధితులు..ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీని ఆశ్రయించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణలత పరారీలో ఉంది . ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు స్వర్ణలతపై ఇప్పటికే వనస్థలిపురంలో ఓ చీటింగ్ కేసు కూడా ఉంది.