స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్

స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో.. సమ్మర్ వెకేషన్ గా పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు.  ముఖ్య అతిథులుగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఇండియన్ స్విమ్మర్ శ్యామల గోలి, స్కూల్ సీఓఓ యశస్వి,  ఎడ్యుకేషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ  జోహర్ ఆరిఫ్, పాఠశాల ప్రిన్సిపల్ మిథాలీ అర్బిట్ తోపాటు.. ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు.. బాడీ ఫిట్ నెస్ ఉంటేనే..అన్ని రంగాల్లో విజయం సాధించగలరన్నారు స్విమ్మర్ శ్యామల. స్టూడెంట్స్ ను ప్రోత్సహిస్తోన్న స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో తెలుగులో మాట్లాడారు. స్విమ్మింగ్ పూల్ ను నా చేతులతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.. పిల్లలకు సమ్మర్ క్యాంప్ ను ఇక్కడ నిర్వహిస్తున్నారు.. నా ఫ్రెండ్ కోసం ఇది చేశాను.. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

నిరుద్యోగుల ఉపాధి కోసం కొత్త జోనల్ వ్యవస్థ