ప్రముఖ బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చా ఇజ్రాయెల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మెరుపు దాడులతో ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలసిందే. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆమె ఇజ్రాయెల్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుండటంతో ఆమె ఆచూకీ లేకుండా పోయారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ : ఆ విషయం ఎవరూ చెప్పలేదు: ఇలియానా
ఆ దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించి ఈ నటిని కాపాడినట్టు తెలుస్తోంది. సురక్షితంగా ఆమెను భారత్కు తరలిస్తున్నట్టు ఇజ్రాయెల్ వెళ్లిన నటుల బృందంలో ఒకరు వెల్లడించారు. నుస్రత్ నిన్న మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. తాను ఓ బేస్మెంట్లో తలదాచుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2010లో శివాజీ హీరోగా వచ్చిన ‘తాజ్మహల్’ అనే సినిమాలో నుస్రత్ నటించింది. బాలీవుడ్లో చోరీ–2 సినిమాతో బిజీగా ఉంది.