యుద్ధంలో చిక్కుకున్న తాజ్​మహల్​ హీరోయిన్​ సేఫ్​

యుద్ధంలో చిక్కుకున్న తాజ్​మహల్​ హీరోయిన్​ సేఫ్​

ప్రముఖ బాలీవుడ్​ నటి నుస్రత్​ భరుచ్చా ఇజ్రాయెల్​లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మెరుపు దాడులతో ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలసిందే. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ కోసం ఆమె ఇజ్రాయెల్​ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుండటంతో ఆమె ఆచూకీ లేకుండా పోయారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ALSO READ : ఆ విషయం ఎవరూ చెప్పలేదు: ఇలియానా

ఆ దేశంలో ఉన్న ఇండియన్​ ఎంబసీ అధికారులు స్పందించి ఈ నటిని కాపాడినట్టు తెలుస్తోంది. సురక్షితంగా ఆమెను భారత్​కు తరలిస్తున్నట్టు ఇజ్రాయెల్​ వెళ్లిన నటుల బృందంలో ఒకరు వెల్లడించారు. నుస్రత్​ నిన్న మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. తాను ఓ బేస్​మెంట్​లో తలదాచుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2010లో శివాజీ హీరోగా వచ్చిన ‘తాజ్​మహల్’​ అనే సినిమాలో నుస్రత్​ నటించింది. బాలీవుడ్​లో చోరీ–2 సినిమాతో బిజీగా ఉంది.