హైదరాబాద్లో గణేశ్ శోభాయత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. లక్షలాది ప్రజలు శోభాయాత్రలో పాల్గొంటున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏరియల్ వ్యూ ద్వారా గణేష్ నిమజ్జనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ,తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజన్ కుమార్ ర అధికారులతో కలిసి వీక్షించారు.
హైదరాబాదో లో గణేష్ నిమజ్జనాలు సెప్టెంబర్ 29 ఉదయం వరకు కొనసాగనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేశామని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
కాసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నంబర్ 13 దగ్గర అధికారులు నిమజ్జనం చేశారు. ఇంకా వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ కు క్యూ కట్టాయి. భక్తులు భారీగా తరలివస్తున్నారు. అధికారులు ఎక్కడిక్కడ భారీబందోబస్తును ఏర్పాటు చేశారు.