కార్మికులు కాదు… యూనియన్ లీడర్లే సమ్మె చేస్తున్నరు: తలసాని

కార్మికులు కాదు… యూనియన్ లీడర్లే సమ్మె చేస్తున్నరు: తలసాని

RTC కార్మికులు సమ్మెచేయడం తగదని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో మాట్లాడిన ఆయన… TSRTC కార్మికులకు దేశంలోనే అత్యధికంగా జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన రవాణాను అందించాల్సిందిపోయి పండుగరోజులలో సమ్మెచేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే 44శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, 16శాతం IRకూడా ఇచ్చామని అన్నారు.  ప్రస్తుతం RTC ఐదు వేల కోట్ల నష్టాల్లో ఉందని, ఏడాదికి 11వందల కోట్ల రూపాయల నష్టం ఉందని చెప్పారు. RTC కార్మికులకు ఏఇబ్బంది లేదు కానీ యూనియన్ లీడర్లే ఈ సమ్మెను చేస్తున్నారని చెప్పారు తలసాని.