మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
సమాజంలోని ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం సహించరానిదని తలసాని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టదని, ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.