Tamannaah Bhatia: రాజమౌళిని ఎన్నోసార్లు అడిగాను..ఎప్పుడూ సమాధానం చెప్పలేదు

Tamannaah Bhatia: రాజమౌళిని ఎన్నోసార్లు అడిగాను..ఎప్పుడూ సమాధానం చెప్పలేదు

రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో రూపుదిద్దుకున్న బహుబలి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ..టాలీవుడ్ సినిమా స్థాయిని ఆమాంతం పెంచేసింది. రానా, అనుష్క, తమన్నాలు బహుబలిలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి  సీక్వెల్గా వచ్చిన బహుబలి 2 కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులో అవంతికగా నటించిన తమన్నా(Tamannaah Bhatia).. ఓ కార్యక్రమంలో ‘బాహుబలి’ని గుర్తుచేసుకున్నారు. రాజమౌళికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పారు. 

'బాహుబలి నటీనటులకే కాదు..దేశ సినిమా చరిత్రకే కీలక మలపని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ప్రపంచమంతా భారతీయ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుందని తెలిపింది. ఇంత గొప్ప చిత్రంలో రాజమౌళి నాకు అవంతిక పాత్రను ఇచ్చారు. దీంతో నటిగా నిరూపించుకోవడానికి నాకు అవకాశం లభించిందని వ్యాఖ్యానించింది.

అయితే తననే ఎంపిక చేయడానికి కారణమేమిటని రాజమౌళిని ఎన్నోసార్లు అడిగానని ఈ మిల్కీ బ్యూటీ వెల్లడించింది. ఆయన ఎప్పుడూ సమాధానం చెప్పలేదని..ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారీ నవ్వుతూ వెళ్లేవారని పేర్కొంది. తన టాలెంట్‌ను రాజమౌళి అర్థం చేసుకొన్నారని..ఆ పాత్రలో నటించడం మొదలుపెట్టాకే తెలిసిందని వివరించింది. ఇటీవలె ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా..ఈ మేరకు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ  గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారని ఆమె ప్రశంసించింది. ఇక గతేడాది వరుస వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మంచి విజయాలను అందుకున్న తమన్నా..ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ బిజీగా ఉంది.రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘స్త్రీ 2’ చిత్రం కోసం తమన్నా ప్రత్యేక గీతంలో నటించారు.