అందుకే సినిమాల్లో నటించడం మానేశా: హీరోయిన్ పద్మప్రియ

అందుకే సినిమాల్లో నటించడం మానేశా: హీరోయిన్ పద్మప్రియ

కేరళ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ నివేదికలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పలువురు నటీమణులు సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్నసంఘటనలు, సమస్యల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ప్రముఖ కోలీవుడ్ నటి పద్మప్రియ జానకీరామన్ గతంలో తాను ఎదుర్కున్న ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది. 

ఇందులోభాగంగా తాను ఓ చిత్రంలో నటించే సమయంలో డైరెక్టర్ తో గొడవ జరిగిందని ఈ క్రమంలో ఆ డైరెక్టర్ తనని కొట్టాడని తెలిపింది. దీంతో కొందరు సినీ పెద్దలకి ఫిర్యాదు చేసినప్పటికీ తనదే తప్పు అని, అలాగే తానే డైరెక్టర్ పై దడి చేసినట్లు చిత్రీకరించి తప్పుడు ప్రచారాలు చేశారని పద్మప్రియ పేర్కొంది. 

కానీ విచారణ సమయంలో తాను ధృడంగా ఉండి న్యాయ పోరాటం చేశానని అందుకే తనపై దాడి చేసిన డైరెక్టర్ కి శిక్ష పడిందని చెప్పుకొచ్చింది. ఈ సంఘటన కారణంగానే తమిళ చిత్రాల్లో నటించడం మానేశానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ALSO READ | అవన్నీ ఫేక్.. నా భర్త మంచోడు: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‎కు జానీ భార్య వివరణ

ఇండస్ట్రీలో ఎవరైనా మహిళలు సమస్యపై పోరాటం చేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని తెలిపింది. ఎందుకంటే సమస్యలపై పోరాటంచేసే మహిళలకి ఇతరుల సహకారం ఉండదని ఈ కారణంగానే చాలామంది తమకి జరిగిన గురించి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రముఖ సింగర్ ఆర్ఫీ పట్నాయక్ హీరోగా నటించిన శ్రీను వాసంతి లక్ష్మి, శర్వానంద్ హీరోగా నటించిన అందరి బంధుయా, మృగం, పటేల్ సర్ తదితర సినిమాలతోపాటూ మరిన్ని డబ్బింగ్ సినిమాల్లో నటించింది.