హైదరాబాద్: సీఎం కేసీఆర్ను తమిళ హీరో విజయ్ కలిశారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన విజయ్.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్తో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కేసీఆర్ ను కలిశారు. వీరిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్ను కేసీఆర్ అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చర్చల కోసమే హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారట. ఈ క్రమంలోనే సీఎంను కలిసినట్లు తెలుస్తుంది. హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలోనూ విడుదలవుతున్న విషయం తెలిసిందే. అదిరింది, విజిల్, తుపాకీ, మాస్టర్, బీస్ట్ సినిమాలు తెలుగులోనూ మంచి ఆదరణ పొందాయి.
మరిన్ని వార్తల కోసం..