దళితులు, ఓబీసీలకు అండగా నిలుస్తాం

దళితులు, ఓబీసీలకు అండగా నిలుస్తాం

హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం (ఏఎంఎంకే)తో ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలు కలసి వనియంబడి, క‌ృష్ణగిరి, సంకరపురం నియోజకవర్గాల్లో జట్టుగా బరిలో నిలుస్తున్నాయి. ఈ పొత్తుపై ఒవైసీ స్పందిస్తూ.. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని, ఏఎంఎంకే, ఏఐఎంఐఎం కూటమి ఆ లోటును భర్తీ చేస్తుందని తెలిపారు. ‘తమిళనాడులోని దళితులు, ఓబీసీలు, ముస్లిం మైనార్టీలకు అండగా నిలవాలన్నదే మా ఆశయం. అణగారిన వర్గాల గొంతుకగా ఉంటాం. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీల్లో ఈ వర్గాలకు బాసటగా ఉండే వారు కరువయ్యారు’ అని ఒవైసీ చెప్పారు.