తమ్మినేనికి తీవ్ర అస్వస్థత..

తమ్మినేనికి తీవ్ర అస్వస్థత..
  • గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరిక
  • గుండె జబ్బుతో ఇబ్బందిపడ్తున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
  • పరామర్శించిన బీవీ రాఘవులు

హైద రాబాద్ :సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా గుండె జబ్బుతో బా ధపడుతూ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో నీరు, తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 

శనివారం (మార్చి 14) పార్టీ పొలి ట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, పార్టీ నాయకులు బి వెంకట్, టి సాగర్, ఎండీ అబ్బాస్, భూపాల్, ఆర్ వెంకట్రాములు, పి జయ లక్ష్మి హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదనీ, రెండు రోజుల్లో కోలుకుంటార ని డాక్టర్లు తెలియజేశారు.