అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరణాలపై సభలో నిరసన తెలిపారు టీడీపీ సభ్యులు. నాటుసారా వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన చేశారు. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సీఎం జగన్ పై టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు స్పీకర్.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్