ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్

హైదరాబాద్: దూర ప్రాంత ప్రయాణికుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. గరుడ ప్లస్, రాజధాని బస్సులలో ప్రయాణించే వారికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్వట్టర్ లో షేర్ చేశారు. వెయిటింగ్ హాల్స్ సదుపాయంతో పాటు టీ, కాఫీ, స్నాక్స్ వంటి వసతులు కల్పిస్తోందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మియాపూర్‌ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, టెలిఫోన్‌ భవన్, కాచిగూడ, ఎల్బీనగర్‌ డిమార్ట్‌ ఎదురుగా చింతలకుంట పల్లవి గార్డెన్స్‌ తదితర బస్టాపులలో ఈ సదుపాయం ఉంటుంది.