
నారాయణపేట, వెలుగు: నారాయణపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఉపాధ్యాయురాలు అనుమానాస్పదంగా చనిపోయినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. దామరగిద్ద ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అలివేలుమంగ(46) ఆదివారం సాయంత్రం అపస్మారక స్థితిలో ఇంటిలో పడి ఉండగా, ఆమె భర్త ఇతరుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని చెప్పారు. మృతురాలి అన్న రమణ తన చెల్లెలి మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.