గడిచిన ఆరేళ్లలో స్టార్టప్ ల సంఖ్య 15 శాతం పెరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. తమిళనాడు చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన 42వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను కొనియాడుతూ ప్రధాని కొన్ని కామెంట్స్ చేశారు. దేశానికి రేపటితరం నాయకులను తయారుచేసేది ఉపాధ్యాయులేనని ప్రశంసించారు.
Today is not only a day of achievement, but also of aspirations. I wish that all the dreams of our youth come true. To teachers & other staff members, you are nation-builders, who are creating the leaders of tomorrow: PM Modi at Anna University pic.twitter.com/DVdxkp6Z9N
— ANI (@ANI) July 29, 2022
కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని ప్రధాని మోడీ అన్నారు. ఆ సమయంలో విశిష్ట సేవలందించిన ప్రజలు, సైంటిస్టులు, హెల్త్ వర్కర్లకు మోడీ ధన్యావాదాలు తెలిపారు. కొవిడ్ కు వ్యతిరేకంగా పోరాడటంలో వీరి కృషి గణనీయమైనదని ప్రధాని వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచం భారత యువత వైపు ఆశగా చూస్తోందన్నారు. దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్న ప్రధాని.. రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా భారత్ మారిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన 70 మంది విద్యార్థులకు ప్రధాని మోడీ బంగారు పతకాలను అందజేశారు.
#WATCH | PM Modi visits multiple classrooms to meet graduating students who couldn’t be present at the main venue of the Anna University convocation ceremony due to space constraints#Chennai pic.twitter.com/XC8fa9vYbY
— ANI (@ANI) July 29, 2022