ప్రిన్సిపాల్‌ పోస్ట్‌ కోసం ఆఫీసులోనే కొట్టుకున్నరు

ప్రిన్సిపాల్‌ పోస్ట్‌ కోసం ఆఫీసులోనే కొట్టుకున్నరు

విద్యార్థులకు మంచి, చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఆవేశంలో కొట్లాటకు దిగిన ఘటన బీహార్‌‌లో జరిగింది. పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీహరిలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న శివశంకర్‌ గిరి, రింకీ కుమారీలు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పోస్ట్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పోస్టుకు ఎవరికి ఎక్కువ సీనియరిటీ, అర్హత ఉన్నాయో తెలుపుతూ అర్హతల పత్రాలను అందజేయాలని జిల్లా విద్యా శాఖ ఆదేశించింది. దాంతో తమ అర్హత పత్రాలను సమర్సించేందుకు ఇద్దరూ గురువారం విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు. ఏం జరిగిందో ఏమో ఉన్నట్టుండి టీచర్లు ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న రింకి కూమారీ భర్త తీవ్ర కోపంతో శివ‌శంక‌ర్ గిరిని కిందపడేసి కొట్టాడు. అక్కడున్న వారు వారిద్దర్నీ విడదీయడానికి ఎంతగా యత్నించినా ఫలితం లేకపోయింది. వీరిద్దరి పోట్లాటను పక్కనున్న వారు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. స్పందించిన అధికారులు.. ఘటనపై విచారణ చేపట్టారు.