ఉప్పల్ వన్డేకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 1.30కి షురూ కానుంది. శ్రీలంకతో వన్డే సిరీస్లో అదరగొట్టిన భారత జట్టు ఈ సిరీస్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్కు హోమ్గ్రౌండ్లో కావడంతో..అతను ఎలా రాణిస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్య, ఇషాన్ (కీపర్), పాండ్యా, సుందర్, కుల్దీప్/చహల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్
న్యూజిలాండ్: అలెన్, కాన్వే, చాప్మన్/నికోల్స్, డారిల్ మిచెల్, లాథమ్ (కెప్టెన్, కీపర్), ఫిలిప్స్, మిచెల్ బ్రేస్వెల్, శాంట్నర్,హెన్రీ షిప్లీ, జాకబ్ డఫీ, ఫెర్గూసన్.