ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫస్ట్

ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫస్ట్

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి చూసుకుంటే భారత్‌ రెండు విక్టరీలు సాధించగా.. ఒక ఓటమి.. మరొకటి డ్రాతో మొత్తంగా 54.17 శాతం పర్సంటైల్‌తో 26 పాయింట్లు సాధించింది. ఇక రెండో ప్లేస్ లో పాకిస్తాన్‌ ఉంది. పాక్‌ జట్టు విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, ఒక ఓటమితో 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌ 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.

పాయింట్ల పరంగా ఇంగ్లండ్‌ విండీస్‌, పాక్‌ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ.. టీమిండియాతో సిరీస్‌లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో 29.17 శాతం పర్సంటైల్‌తో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో విజయాన్ని అందుకుంది. 1971లో అజిత్‌ వాడేకర్‌ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కోహ్లి నాయకత్వంలో ఓవల్‌ గ్రౌండ్ లో విక్టరీని సాధించింది. ఇక చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్‌ 10 నుంచి మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది.