కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాండ్యా దూరం

కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాండ్యా దూరం

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలింది. గాయం కారణంగా వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా ఆదివారం  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరం అయ్యాడు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గురువారం  జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంతిని ఆపబోయిన పాండ్యా ఎడమ కాలికి దెబ్బ తగిలింది. స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత అతను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దాంతో, తను జట్టుతో పాటు ధర్మశాల వెళ్లకుండా రివకరీ కోసం బెంగళూరులోని నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకాడమీ వెళ్లనున్నాడు.

కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అతను బరిలో దిగడం లేదు. ఈ నెల 29న ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం నేరుగా లక్నో వెళ్లి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలుస్తాడని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. దాంతో, కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరులో కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాండ్యా స్థానంలో సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరు తుది జట్టుకి వచ్చే చాన్సుంది.