కోహ్లీ బర్త్‌‌డే కోసం..

కోహ్లీ బర్త్‌‌డే కోసం..

కోల్‌‌కతా: టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ విరాట్‌‌ కోహ్లీ నవంబర్ 5వ తేదీన 35వ బర్త్‌‌డే జరుపుకోనున్నాడు. అదే రోజు ప్రఖ్యాత ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో సౌతాఫ్రికాతో ఇండియా పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌‌ సందర్భంగా కోహ్లీ బర్త్‌‌డేను గ్రాండ్‌‌గా సెలబ్రేట్‌‌ చేయాలని క్రికెట్‌‌ అసోసియేషన్​ ఆఫ్​ బెంగాల్​ (క్యాబ్‌‌) భారీ ప్లాన్‌‌ చేసింది. మ్యాచ్‌‌కు హాజరయ్యే 70 వేల మందికి విరాట్‌‌ కోహ్లీ ఫేస్‌‌ మాస్క్‌‌లను ఫ్రీగా అందించనుంది. దాంతో ఆ రోజు స్టేడియం మొత్తం కోహ్లీ బొమ్మలతో కనువిందు చేయనుంది.

మ్యాచ్‌‌కు ముందు స్టేడియంలో కేక్‌‌ కట్‌‌ చేయడంతో పాటు కోహ్లీని ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తమ ప్లాన్స్‌‌కు ఐసీసీ అప్రూవల్‌‌ ఇస్తుందని క్యాబ్ ప్రెసిడెంట్‌‌ స్నేహశీష్​ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.