మారిన టీమిండియా జెర్సీ 

 మారిన టీమిండియా జెర్సీ 

టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరుతో  ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ తెలిపింది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది.

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం IPL లో పాల్గొంటున్నారు. ఈ నెల 15తో  IPL ముగియనుంది. ఆ తర్వాత రెండ్రోజులకే, అంటే ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న UAE గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు మెసేజ్ లు పంపుతున్నారు.