ఇడ్లీ అమ్మకు ఇల్లు కట్టించిన టెక్ మహీంద్రా

ఇడ్లీ అమ్మకు ఇల్లు కట్టించిన టెక్ మహీంద్రా

తమిళనాడు: రూపాయికే ప్లేట్ ఇడ్లీలతో... పేదల ఆకలి తీరుస్తూ  ‘ఇడ్లీ అమ్మ’ గా పేరు తెచ్చుకున్న 80 ఏళ్ల కమలాత్తాళ్ కు టెక్ మహీంద్రా కంపెనీ అంతర్జాతీయ మాతృ దినోత్సవం రోజున అపూర్వమైన కానుక అందించింది. ఆమె కోసం తమిళనాడులోని ఆమె సొంత ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇచ్చింది. ఈ మేరకు మహీంద్రా కెంపెనీకి చెందిన వ్యక్తులు కొత్త ఇల్లుకు సంబంధించిన గృహ ప్రవేశ కార్మక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్ రిబ్బన్ కట్ చేసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. 

తమిళనాడులోని పడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్ 37 ఏళ్లుగా ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోంది. ఒక్క రూపాయికే ప్లేట్ ఇడ్లీలు ఇస్తూ ఈ బామ్మ వార్తల్లో కెక్కింది. ఈ క్రమంలోనే బామ్మ విషయం ఆనంద్ మహీంద్రా దాకా వెళ్లింది. బామ్మకు ఇల్లు కట్టిస్తానని 2019 లో ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. అన్నట్టుగానే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఇడ్లీ అమ్మకు ఈ చిన్న సాయం చేయడం సంతోషంగా ఉంది. అందరికి హ్యాపీ మదర్స్ డే’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే సకాలంలో ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయించిన మహీంద్రా సంస్థ ఉద్యోగులను ఆయన అభినందించారు. 

మరిన్ని వార్తల కోసం...

ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు

భారీ నష్టాల్లో దేశీ సూచీలు