మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు తీన్మార్ మల్లన్న (అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ). అమెరికాలో జరిగే క్యాట్ వాక్ గురించి తెలుసుకునే కేటీఆర్ కు కడెం ప్రాజెక్టు గురించి తెల్వదనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో జరిగేది అభివృద్ధి కాదు విధ్వంసం అని మండిపడ్డారు. మానుకోట రాళ్ళ చరిత్ర ప్రపంచానికి తెలుసని.. మరో నాలుగు నెలలు ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టే సమయం వస్తదన్నారు.
కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే ఒంటి మీద బట్టలను కూడా ఉంచడంటూ ఎద్దేవా చేశారు మల్లన్న . రాష్ట్రంలో ప్రజలు వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ మొద్దు నిద్రలో ఉన్నాడని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో రాజకీయం కోసం స్టీరింగ్ కమిటీ వేసిన ముఖ్యమంత్రికి.. వరదల కోసం స్టీరింగ్ కమిటీ వేసే టైం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు గట గట తాగుడు ,కట కట తినుడు తప్ప ఏమి తెల్వదన్నారు.