కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు

కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు
  • టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యమ్నాయం
  • బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి

వికారాబాద్: ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలకోరు అని, తన అసభ్య పదజాలంతో భారత జవాన్లను కూడా కించపరిచిన దేశద్రోహి అని మండిపడ్డారు బీజేపి సీనియర్ నాయకురాలు విజయశాంతి. శనివారం పూడూరు మండలం కంకల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేసిన విజయశాంతి.. కేసీఆర్పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తానే తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లేనేలేడంటూ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సపోర్ట్ చేసిన విషయాన్ని మరువొద్దన్నారు. డబ్బు, అధికారం ఉన్నదనే అహంకారంతో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీ ఎదుగుతోందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరికొన్ని వార్తల కోసం:

ప్రభాస్ తో నటించడం నాకు దక్కిన గౌరవం