
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ను ఢీ కొట్టే దమ్ము బీజేపీకే మాత్రమే ఉందన్నారు. జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల కీలక భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయికి చేరిందన్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదన్న జితేందర్ రెడ్డి... పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఢిల్లీలోనే జరుగుతుందన్నారు. పార్టీ అధ్యక్ష మార్పు అంటూ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో వారి ఇష్టమన్నారు .
వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తు్ందని, అధికారంలోకి వస్తుందని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనతో ప్రజులు విసిగిపోయారని,బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.