
తెలంగాణరాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 4గంటల పాటు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి విడుతలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు 22వేల 500 కోట్లు విడుదలకు కేబినెట్ నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన వారందిరికీ త్వరలో తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాలకు 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్దరించాలని నిర్ణయించింది. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పాటు చేయాలని మంగళవారం (మార్చి 12) జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షల వరకు బీమా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.