
- మొదటి, మూడో శనివారం..
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ భేటీ నిర్వహించనున్నది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో వేగం పెంచాలని, అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినెట్లో సమీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. రెండు వారాలకోసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతినెల మొదటి, మూడో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఆలోచిస్తున్నారు.