హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా రివ్యూలు, పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత ఐదారు రోజులుగా ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రెస్ట్ తీసుకున్నారు.
విద్యాశాఖపై ఇయ్యాల సీఎం రివ్యూ!
విద్యాశాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి అధికారులతో శనివారం సమీక్షించ నున్నారు. స్కూల్, ఇంటర్, కాలేజీల తోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులకూ సీఎంవో నుంచి సమాచారం అందింది. విద్యాశాఖ సెక్రటరీతో పాటు స్కూల్, ఇంటర్, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్లతో ఇటీవలే సీఎం చర్చించారు.
ఈ క్రమంలో మరోసారి సమగ్రంగా చర్చించేందుకు శనివారం సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం దగ్గరే ఆ శాఖ ఉండటంతో ప్రాధాన్యత పెరిగింది. తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.