కేసీఆర్పై పోటీ ఎవరు?.. కాంగ్రెస్ ప్రకటించని 19 స్థానాలు ఇవే..

కేసీఆర్పై  పోటీ ఎవరు?.. కాంగ్రెస్ ప్రకటించని 19 స్థానాలు ఇవే..

45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది.దీంతో ఇప్పటి వరకు 100 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.  నాలుగు సీట్లను సీపీఐ,సీపీఎం కు కేటాయించారు.  ఇందులో చెన్నూరు, కొత్తగూడెం సీపీఐకి ఇవ్వనున్నారు. సీపీఎంకు  రెండు సీట్లు ఇవ్వనున్నారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ టికెట్ పెండింగ్ లో పెట్టారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా  దానిని పెండింగ్ లో పెట్టారు.

సిద్దిపేట నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సిరిసిల్ల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే..  సిరిసిల్ల పెండింగ్ లో పెట్టారు. 15 సీట్లలో  స్క్రీనింగ్ కమిటీలో, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో వాటి నిర్ణయాధికారాన్ని ఏఐసీసీకి అప్పగించారు. దీంతో ఆ స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనేది  సస్పెన్స్ గా మారింది .

కాంగ్రెస్ ప్రకటించని 19 స్థానాలు ఇవే

  • వైరా
  • కొత్తగూడెం
  • మిర్యాలగూడ
  • చెన్నూరు
  • చార్మినార్
  • నిజామాబాద్అర్బన్
  •  కామారెడ్డి
  • సిరిసిల్ల
  • సూర్యపేట
  • తుంగతుర్తి
  • బాన్సువాడ
  • జుక్కల్
  •  పఠాన్ చెరు
  • కరీంనగర్
  •  ఇల్లందు
  • డోర్నకల్
  • సత్తుపల్లి
  • నారాయణ ఖేడ్
  •  అశ్వరావుపేట