
మాదకద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడులతో డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేస్తోంది ఈగల్ టీం.
ఈ క్రమంలో హైదరాబాద్ లోని జీడిమెట్లలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది. 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 72 కోట్లు.. మన దేశంలో దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.. నలుగురు నిందితులు అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో ప్రముఖ రసాయన పరిశ్రమలలో తయారు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగంచినట్లు గుర్తించారు. డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడు శివ రామకృష్ణగా ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములా సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సెప్టెంబర్ 5న చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లోకెమికల్ ఫ్యాక్టరీ కేంద్రంగా, ఎండీ (మె ఫెడ్రోన్) అనే మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం..సుమారు రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఇలా నగరం నలుమూలల ఎక్కడో ఓ చోట డ్రగ్స్ తయారీ కేంద్రాలు ఉండడం కలకలం రేపుతోంది.