ముషీరాబాద్, వెలుగు: అన్ని వర్గాలకు న్యాయం, అందరికీ సమాన అవకాశాలు కాంగ్రెస్తోనే సాధ్యమని ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ముషీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్కు మద్దతుగా శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల స్కీమ్ పాంప్లెంట్ను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు.
కాంగ్రెస్ అధికాంలోకి వస్తే చేయబోయే పనులను వివరించి హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. అంజన్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని ముషీరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని ఆయన పిలుపునిచ్చారు.