- కర్నాటకలో అన్ని హామీలు అమలు చేస్తున్నం
- 5 గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేయొద్దు
- ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- అంబర్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్రెడ్డికి మద్దతుగా ప్రచారం
అంబర్పేట, వెలుగు: కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. 5 గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారు కర్నాటకకు వచ్చి చూడాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేట సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం రాత్రి నిర్వహిచిన రోడ్ షోలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతితో కలిసి ఆయన
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అంబర్ పేట నుంచి రోహిన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.