
సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం 5 గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
డైలీ ఉదయం 6 గంటలకు నాంపల్లి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఉదయం 11 గంటలకు బయలు దేరుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.