- ఈ నెల 28న లోక్ అదాలత్ కు ఏర్పాట్లు చేస్తున్నం: డీజీపీ శివధర్రెడ్డి
- హైకోర్టు జడ్జి శ్యామ్ కోషితో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల(2020కి ముందు ఉన్నవి)పై ఫోకస్పెట్టామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ నెల 14న జరగాల్సిన లోక్ అదాలత్ 28వ తేదీకి రీషెడ్యూల్ అయినందున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రతీరోజు డైలీ సిట్యుయేషన్ రిపోర్ట్ ద్వారా స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో, సీఐడీ విభాగాలు కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. రాజీ పడదగ్గ కేసులు, జారీ చేసిన నోటీసులు, ప్రీ -లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నం
రాజీ పడదగ్గ కేసులను ముందుగానే గుర్తించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. గతేడాది మార్చి 8న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,83,182 కేసులు, జూన్14న 1.93 లక్షలు, నవంబర్ 15, డిసెంబర్ 21న జరిగిన లోక్ అదాలత్లో 1,79,964 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ, సీఐడీ చారుసిన్హా, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
