
కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు తరువాత వివిధ శాఖల్లో ఫైళ్ల గల్లంతు, ధ్వంసంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఫైళ్ల నిర్వహణపై ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు విధివిధానాలు జారీ చేసింది. శాఖల వారీగా ఫైళ్ల వివరాలను నమోదు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించింది. ఫైల్ మాయమైతే సంబంధిత అధికారులపై క్రిమినల్, శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఫైళ్ల నిర్వహణపై డిసెంబర్ 18లోగా నివేదికలు ఇవ్వాలన్న సీఎస్ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ శాఖల్లోని కీలక ఫైళ్లను కొందరు అధికారులు చింపేస్తున్నారు. మరికొందరు ఫర్నీచర్తో పాటు ఫైళ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాత సర్కార్ పాలనపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు టూరిజం కార్పొరేషన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కీలక ఫైళ్లన్నీ కాలిబూడిదయ్యాయి. . అసలు ఆ ఫైళ్లు, కంప్యూటర్లలో ఏం దాగుందన్న చర్చ మొదలైంది.