హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతను మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన భద్రతకు ఓ పైలెట్ వాహనంతో పాటు 10 మంది భద్రత సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భద్రత డబుల్ కానుంది. రెండు పైలెట్ వాహనాలు, 20 మంది భద్రత సిబ్బందిని ఆయన కోసం కేటాయించారు.
కాగా.. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కొంతమంది కుట్ర పన్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు. ఈ హత్యా కుట్రలో నిందితులుగా భావిస్తున్న 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిని హతమార్చేందుకు ప్రధాన నిందితులు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మంత్రికి ప్రాణహానీ ఉందనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.
మరిన్ని వార్తల కోసం:
భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్
వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ